ఈ ఈవెంట్ లో మాట్లాడిన చిరు ఈ సినిమా గురించి, ఇందులో తెరపై మరియు తెరవెనుక సినిమాలో భాగమైన వారి గురించి చెప్పారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పడం విశేషం. ఈ సినిమాలో స్వార్థ రాజకీయ నాయకుల తీరును మరియు ప్రభుత్వం పనితీరును విమర్శించే ఒక జర్నలిస్ట్ పాత్ర ఇంది. మొదట ఈ పాత్ర కోసం ఎవరు చేస్తే బాగుంటుంది అని మోహన్ రాజా చిరంజీవిని అడిగారట. అందుకు చిరంజీవి బాగా ఆలోచించి డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే సరిగ్గా సూట్ అవుతారని చెప్పాడట.. అలా పూరి ఈ సినిమాలో ఒక భాగం అయ్యాడు.
ఇక మొదట నేను నటించను సినిమాలో నువ్వు నటించాలి అని చిరు చెప్పగానే.. సార్ నేను డైరెక్టర్ ని సార్ నటీనటులను నటింపచేస్తాను కానీ, నేను నటించలేను అంటూ చెప్పారా పూరి. అయితే చిరు తనను ఈ పాత్రకు నువ్వు మాత్రమే న్యాయం చేయగలవు అంటూ తనకు నమ్మకం కలిగేలా చేశాడు. ఆ తర్వాత పూరి ఈ సినిమాలో అద్భుతంగా నటించి నటుడిగా కూడా తాను నిరూపించుకున్నాడు అంటూ పొగిడారు చిరు. కాగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 వ తేదీన చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది.