రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ అనే మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అవుతున్న ఈ మూవీ నుండి చిత్ర బృందం ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు. ఈ మూవీ నుండి చిత్ర బృందం అప్డేట్ లను విడుదల చేయకపోవడానికి ప్రధాన కారణం ఈ మూవీ లో వి ఎఫ్ ఎక్స్ వర్క్ అత్యధికంగా ఉండడం వల్ల ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే అక్టోబర్ 2 వ తేదీన ఆది పురుష్ మూవీ యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మరియు టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ పై రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.

ప్రభాస్ ఈ మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా ,  కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో కనిపించబోతుంది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణాసురుని పాత్రలో కనిపించబోతున్నాడు. ఆది పురుష్ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: