బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఆ తర్వాత ఏ సినిమా కూడా ఈ ఏడాది విడుదల అయ్యే విధంగా సిద్ధంగా లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే సలార్ సినిమా ఈ ఏడాది రాబోతుంది అన్నారు. కానీ అది ఎందుకో వర్కౌట్ రావడంలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మాత్రం బాలీవుడ్ సినిమా ఆది పురుష్ విడుదల అవుతుంది తప్పా ఏ సినిమా కూడా ఇప్పట్లో విడుదల కావట్లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడం ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆగ్రహ పరుస్తుంది. తాజాగా అప్డేట్ రావడం అందరిని సంతోషపెడుతుంది.
బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ఆది పురుష్ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా యొక్క ప్రీ లుక్ కొంతమంది ప్రేక్షకులకు నచ్చడం లేదని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ మొహం సరిగ్గా కనపడకుండా ఉండడం విల్లుతో నార్మల్ లుక్ లో ప్రభాస్ కనపడడం ఇలాంటివి వారిని నిరాశపరుస్తున్నాయి. మరి ఈ సినిమా ప్రభాస్ అభిమానులను ఏ స్థాయి లో ఆకట్టుకుంటుంటాయో చూడాలి.