బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతలలో ఒకరు అయిన కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరణ్ జోహార్ ఇప్పటికే ఎన్నో మూవీ లకు నిర్మాతగా వ్యవహరించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ అనే తెలుగు మూవీ కి కూడా కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించాడు.

లైగర్ మూవీ ని పూరి జగన్నాథ్ తో కలిసి కరణ్ జోహార్ నిర్మించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఇలా నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే కాఫీ విత్ కరణ్ షో విజయవంతంగా 7 సీజన్ లను పూర్తి చేసుకుంది. కాఫీ విత్ కరణ్ షో 7 సీజన్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యింది. కాఫీ విత్ కరెంట్ షో 7 సీజన్ 12 వారాల పాటు ప్రేక్షకులను అలరించింది.

కాఫీ విత్ కరెంట్ షో 7 సీజన్ లో  పలు జంటలు హాజరయ్యాయి. ఇది ఇలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా తాప్సి వరుస విజయాలను అందుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ నాటిగా కొనసాగుతుంది. ఈ ముద్దుగుమ్మను కాపీ విత్ కరణ్ షో కి పిలవకపోవడంపై తాజాగా కరణ్ జోహార్ స్పందించాడు ... ప్రేక్షకులను అలరించే సెలబ్రిటీ జోడీలను తమ టీమ్ ఎంపిక చేసిందని , తాప్సీ కి సెట్ అయ్యే జోడీ దొరికితే ఆమెను  స్వయంగా తానే ఆహ్వానిస్తానని  కరణ్ జోహాన్ అన్నారు. అప్పుడు తన షోకు తాప్పీ రాకపోతే తాను బాధపడతానని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: