తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన పరుశురామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . పరుశురామ్ ,  విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన గీతా గోవింద మూవీ తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. గీత గోవిందం మూవీ తర్వాత పరుశురామ్   నాగ చైతన్య తో ఒక మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

కాక పోతే అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో పరశురామ్ సినిమా చేసే అవకాశం రావడంతో ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట మూవీ తర్వాత నాగ చైతన్య ,  పరశురామ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా సర్కారు వారి పాట మూవీ తర్వాత పరుశురామ్ ,  నాగ చైతన్య కు ఇప్పటికే కథను వినిపించగా ,  ఆ కథలో నాగ చైతన్య కొన్ని మార్పులు మరియు చేర్పులను సూచించినట్లు ,  ప్రస్తుతం పరశురామ్ ,  నాగ చైతన్య సూచించిన మార్పులు మరియు చేర్పులను సరిదిద్దుతున్నట్లు తెలుస్తుంది. దానితో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కాస్త ఆలస్యం కానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య 'దూత' అనే ఒక వెబ్ సిరీస్ తో పాటు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: