చిరంజీవి తన భార్య సురేఖ ఎప్పుడు విదేశాలకు వెళ్ళని వారు కూడా ఈ సినిమా నుంచి ఉపశమనం కోసం అమెరికాకు వెళ్లడం కూడా జరిగింది. దీంతో ఒక వారం రోజులపాటు ఆచార్య సినిమా ఫ్లాప్ జ్ఞాపకాలను సైతం మర్చిపోవడానికీ అంత దూరం వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే ఆచార్య సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఆచార్య సినిమా డిజాస్టర్ తనని చరణ్ ని పెద్దగా భావించలేదు కానీ ఈ సినిమా కోసం కొరటాల శివ చాలా కష్టపడ్డారు కానీ వాళ్ళ అంచనాలను ఒక్కసారిగా తప్పయని తెలిపారు. అయితే ఎవరిని నిందించాల్సిన పని మాత్రం లేదు.. ప్రేమ కోసం అంత కలిసి పనిచేశాము.. విజయం అపజయం అందరికీ సమానమే అని తెలియజేశారు. అంతేకాకుండా కుమారుడితో కలిసి నటించిన మొదటి చిత్రమే ఇలా ఫ్లాప్ కావడంతో కాస్త నిరుత్సాహానికి కలిగామని తెలియజేశారు. అయితే తన కుమారుడు మాత్రం ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలియజేశారు. ఎప్పటికైనా తన కొడుకుతో కలిసి మరొక సినిమా చేస్తానని తెలిపారు.