మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. అవి థియేటర్లలో సంచలనాలు సృష్టించినవి కావు. ఈ విషయం మహేష్ - త్రివిక్రమ్ ఇద్దరూ కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు.


అయినప్పటికీ ఈ ఇద్దరూ కలిస్తే జనాలు ఎంజాయ్ చేసే సినిమా, గుర్తుండిపోయే సినిమా అయితే రూపొందుతుంది అని ప్రేక్షకులు నమ్ముతారు. అతడు, ఖలేజా సినిమాలు చూస్తూ ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అందుకే ..


 


మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమాకి నాన్ థియేట్రికల్, థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది అంటూ కథనాలు కూడా వినిపించాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ కి రూ.75 కోట్లు, థియేట్రికల్ బిజినెస్ రూపంలో రూ.125 కోట్లు .. మొత్తం కలుపుకుని రూ.200 కోట్లు బిజినెస్ చేసినట్టు కథనాలు పుట్టుకొచ్చాయట.. అయితే ఈ వార్తల పై నిర్మాత నాగ వంశీ స్పందించాడు. ఇప్పటివరకు ఈ చిత్రానికి ఎటువంటి బిజినెస్ అయితే జరిగలేదు.


 


ఈ మధ్యనే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేశాం. ఇంకా నాన్ థియేట్రికల్ కు సంబంధించి ఎవ్వరూ సంప్రదించలేదు. మేము కూడా వెంటనే ఎటువంటి ఓటీటీ సంస్థని కూడా సంప్రదించలేదు. ముందుగా మేము సంప్రదిస్తే వాళ్ళు ఏదో ఒక ఫేవర్ అడుగుతారు. అందుకోసమే మేము ఇంకా ఎవ్వరినీ సంప్రదించలేదు. ముందుగా ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయం పై అవగాహన వచ్చాక అప్పుడు నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి ఆలోచిస్తాం ' అంటూ చెప్పుకొచ్చాడట. మహేష్ త్రివిక్రమ్ సినిమా అంటేనే ఎన్నో అంచనాలు అయితే ఉంటాయి. ఈ అంచనాలు కు తగ్గ బడ్జెట్ కూడా ఉంటుంది. అయితే పాన్ ఇండియా సినిమా అయితే కాదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. మరి త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: