టాలీవుడ్ నటి హేమ ఈరోజు విజయవాడ కనక దుర్గమ్మ గుడికి వెళ్లి సందడి చేశారు. ఈ క్రమంలో ఆమె ఓ జర్నలిస్ట్ పై ఫైర్ అవ్వడం చర్చనీయాంశం అయ్యిందట..


హేమ మాట్లాడుతూ.. ' అందరికీ నమస్కారం అండి.! నేను మీ హేమని..! ఈరోజు దుర్గమ్మ వారిని దుర్గమ్మ రూపంలో దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందం గా ఉంది. ఈ సంవత్సరం మిస్ అయిపోతానేమో.. రాలేనేమో.. ప్రోటోకాల్ ఇబ్బంది అంటున్నారు.. చాలామంది జనాలు పోటెత్తుకొస్తున్నారు అది ఇదీ అనుకున్నారట.


కానీ లాస్ట్ మినట్లో ఎలాగో ఆ దుర్గమ్మ పిలిచింది నేను వచ్చాను.. చాలా సంతోషంగా ఉందండి.! ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా ఎంత పుణ్యం చేసుకున్నారో.. అలాగే మీడియా వాళ్ళ పుణ్యమా అని ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారిని చూపిస్తూనే ఉన్నారు. మా అందరికీ ఎంత పుణ్యమో.. మీడియా మిత్రుల కు కూడా అంతే పుణ్యం వస్తుంది. ఇక్కడికి రాలేని వారికి కూడా అంతే పుణ్యం దక్కాల ని ఆ దుర్గమ్మని కోరుకుంటున్నాను…


 


థాంక్యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు' అంటూ హేమ చెప్పుకొచ్చింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ 'మీరు ప్రోటోకాల్ ఫాలో అయ్యి.. టికెట్ కొనుక్కునే వచ్చారా?' అంటూ హేమాను ప్రశ్నించాడట. ఇందుకు హేమకు బాగా కోపం వచ్చింది. 'నేను ప్రోటోకాల్ ఫాలో అయ్యే వచ్చాను. టికెట్ కొనుక్కొని వచ్చాన ని చెప్పింది.


 


హుండీ లో రూ.10 వేలు వేసాను, అమ్మవారికి రూ.20 వేల రూపాయల చీర తెచ్చాను. ఎందుకు ఈ విషయాన్ని కాంట్రావర్సీ చేస్తున్నారు' అంటూ ఆమె మండిపడింది.ప్రస్తుతం ఆమె వరుస సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీ గా గడుపుతున్న విషయం తెలిసిందే.మరి కొద్దీ కాలం నుంచి ఆమెకు ఆఫర్స్ అయితే కరువయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: