శ్రీ రెడ్డి.. ఈమె గురించి కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే  దాదాపు తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ రెడ్డి ఎవరో తెలుసు. అయితే సినిమాల ద్వారా ఈ అమ్మడు పాపులారిటీ సంపాదించింది చాలా తక్కువే. కానీ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించింది కాస్త ఎక్కువ అని చెప్పాలి. మీ టు ఉద్యమం సమయంలో అర్థనగ్న ప్రదర్శన చేయడం ద్వారా ఒక్కసారిగా తెరమీదకి వచ్చింది శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లొ నిలుస్తూ ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా మెగా హీరోలను టార్గెట్ గా చేసుకుంటూ దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇటీవల ఒక వంటల కార్యక్రమం కూడా చేస్తూ తన అందాలతో అందరి మతి పోగోడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇకపోతే ఏళ్లు గడుస్తున్నాయి కానీ శ్రీరెడ్డి మాత్రం పెళ్లి జోలికి వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల పెళ్లి గురించి తన మనసులో మాటను బయట పెట్టింది.


 ఇప్పుడు వరకు పెళ్లి విషయంలో ఎవరు నాకు సరైన వ్యక్తులు అనిపించలేదు ఎంతోమంది అబ్బాయిలు ప్రపోజ్ చేసి డేటింగ్ చేసి పక్కన పెట్టే విధంగానే వ్యవహరిస్తున్నారు. హ్యాపీగా సంసారం చేసుకోవాలనుకునే వారు ఎవరు కనిపించడం లేదు. ఇకపోతే నేను చాలా టిపికల్ క్యారెక్టర్.. నన్ను మ్యారేజ్ చేసుకోవడం సాధారణ మగాళ్ళ వల్ల కాదు. వాళ్లు నన్ను తట్టుకోలేరూ. చాలా హై థింకింగ్, పెద్ద మనసు ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటారు. అయితే పార్టీలకు వెళ్ళినప్పుడు కొంతమంది నచ్చుతారు. కానీ వారికి అప్పటికే పెళ్లయి ఉంటుంది. ఇక ఒంటరిగా ఉంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుంది. 90% ఒంటరిగా ఉండటం వల్లే సంతోషంగా ఉంటాం అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: