హీరో గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన తాజా చిత్రం పక్క కమర్షియల్. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా రాశి ఖన్నా నటించింది. పక్కా కమర్షియల్ చిత్రంతో తను వరుస ప్లాపులకు బ్రేక్ పడుతుంది అనుకున్న గోపీచంద్ కు ఈ చిత్రం చాలా నిరాశను మిగిల్చింది. తనకు హిట్ ఇవ్వలేకపోయినా కూడా హీరో గోపీచంద్ నిరుత్సాహం పడకుండా మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.


అయితే ఈసారి కచ్చితంగా హిట్ సాధించాలని ఉద్దేశంతోనే యాక్షన్ త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గోపీచంద్, శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా యాక్షన్ త్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల కూ కూడా సక్సెస్ చాలా అవసరం.


ఈ ఇద్దరు కూడా సక్సెస్ సాధించాలనే కసితో ఉన్నారు. ఇక వీరిద్దరికి కూడా సక్సెస్ ప్రస్తుతం చాలా అవసరము. శ్రీనువైట్ల గతంలో వచ్చిన ఎన్నో చిత్రాలు భారీగాని విజయాన్ని అందుకున్నాయి కానీ ఈ మధ్యకాలంలో వరుసగా పలు ఫ్లాప్ లు చవిచూస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు చిత్ర బృందం. మరి ఈ సినిమాతో నైనా వీరిద్దరూ సక్సెస్ అవుతారేమో చూడాలి మరి. ఇక అంతే కాకుండా గోపీచంద్ సక్సెస్ కావడానికి విలన్ గా కూడా నటించడానికి సిద్ధమే అన్నట్లుగా గతంలో తెలియజేశారు. మరి ఈసారి హీరోగా లేదంటే విలన్ గా అయిన నటిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: