టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య అయినా ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇందిరాదేవి 70 ఏళ్ల వయసులో కన్నుమూసింది.
ఈమె కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో పుట్టింది. ఇందిరా దేవి కృష్ణతో పెళ్లయ్యి పిల్లలు పుట్టాక తరచూ తన కొడుకులతో కలిసి తన సొంత ఊరు అయినా ముసలిమడుగు వెళ్లి వచ్చేదట. ఇక ఆమె ఎప్పుడు వెళ్ళినా కూడా అందర్నీ చాలా ఆప్యాయంగా పలకరించేదట. చాలామంది ఆమెను మనసున్న మనిషి అని అంటారు.ఎందుకంటే ఎంత డబ్బు ఉన్న కూడా ఆమె లో కొంచెం కూడా అహం కనిపించేది కాదట.

ఇక ఇలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి కన్నుమూసే సరికి ఆమె సన్నిహితులు చాలా బాధపడుతున్నారు. అయితే ఇందిరాదేవి ముందు నుండి కూడా చాలా సైలెంట్ గా ఉండి ఎవరితో ఎక్కువగా మాట్లాడే వారు కాదట. కానీ మన అనుకుంటే మాత్రం వారిని ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని మరి చూసుకుంటారని ముసలిమడుగు లో ఉండే జనాలు చెబుతూ ఉంటారు. అయితే ఇందిరా దేవి చనిపోయాక ఆమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆమె చివరి రోజుల్లో మహేష్ బాబుని ఒక కోరిక కోరిందట. కానీ చివరి కోరిక తీరకుండానే ఆమె మరణించింది. ఇంతకీ ఆమె మహేష్ బాబును ఏం కోరిందంటే.. తన మనవరాలు సితార కు ఓనిల ఫంక్షన్ చేస్తే చూడాలని ఉందని చెప్పిందట.

కానీ మహేష్ బాబు మాత్రం నాకు అలాంటివి నచ్చవు అమ్మా అంటూ తెగేసి చెప్పాడట. అంతేకాదు ఇందిరాదేవి ఇది నా చివరి కోరిక నేను బతికి ఉన్నప్పుడే నా మనవరాలిని ఒక్కసారైనా పరికిణీ లో చూడాలనుకుంటున్నాను అని అడిగిందట. మహేష్ బాబు ఎంతకీ ఒప్పుకోలేదట. కానీ ఇప్పుడు వద్దులే అమ్మ తర్వాత చూద్దాం అంటూ తన తల్లి కోరికను మహేష్ బాబు నెగ్లెట్ చేశారట. ఇక తీరా ఆమె చనిపోయే సరికి ఆమె చివరి కోరికను తీర్చలేక పోయానే అని మహేష్ బాబు తలుచుకొని మరి చాలా బాధపడ్డారట. ఇక ఈ విషయంలో సితార కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సితార నానమ్మ పార్థివదేహం దగ్గర బోరుమని ఏడ్చిన వీడియో ఎంతో వైరల్ అయింది.ఇక ఈ విధంగా మహేష్ బాబు తన అమ్మ చివరి కోరిక తీర్చలేకపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: