లెజెండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి  నటుడిగా కాకుండా నిర్మాతగా బాగా సక్సెస్ అయ్యారు అల్లు అరవింద్.  గీత ఆర్ట్స్ అనే బ్యానర్ను స్థాపించి ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాతలలో ఒకరిగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి.  అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రేక్షకులందరికీ ఐకానిక్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇకపోతే ఇప్పటికే అన్ని రకాల బిజినెస్లను స్టార్ట్ చేసిన అల్లు అరవింద్ ఇటీవల అల్లు స్టూడియోస్ ని కూడా స్థాపించి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయారు అన్న విషయం తెలిసిందే



 ఇక కనీసం క్షణమైనా ఖాళీ లేకుండా అల్లు అరవింద్ ఎంతో బిజీ బిజీగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటి అల్లు అరవింద్ మొదటిసారి ఒక టాక్ షో కి వచ్చారు. కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించె ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు అల్లు అరవింద్. సాధారణంగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చిన గెస్టులను కమెడియన్ అలీ అడిగే ప్రశ్నలు కాస్త కొత్తగా ఉంటాయి. ఇక ఇలాంటి సమయంలోనే కొన్ని కాంట్రవర్షియల్ ప్రశ్నలు కూడా అడుగుతూ ఇక వచ్చిన గెస్టులను ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే  ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన అల్లు అరవింద్ ను ముందుగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని సరదా ప్రశ్నలు అడిగాడు కమెడియన్ అలీ. ఆ తర్వాత ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య ఏదో విభేదాలు వచ్చాయి అంటూ టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుండగా.. ఇదే విషయంపై ఆలీ ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా అల్లు అరవింద్ సీరియస్ అయ్యాడు. కాంట్రవర్సీ చేద్దామని పిలిచావా అంటూ మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: