అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన మోహన్ రాజా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకుడు మోహన్ రాజా "హనుమాన్ జంక్షన్" అనే తెలుగు మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో జగపతి బాబు , అర్జున్ కీలక పాత్రలలో నటించారు  ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత మోహన్ రాజా తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.

అందులో భాగంగా మోహన్ రాజా ఎన్నో తమిళ సినిమాలకు దర్శకత్వం వహించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే దర్శకుడు మోహన్ రాజా "తని ఒరివన్" అనే తమిళ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో తమిళ సినిమా ఇండస్ట్రీ లో మోహన్ రాజా కు అదిరి పోయే రేంజ్ గుర్తింపు లభించింది. ఈ సినిమా తెలుగు లో ధ్రువ పేరుతో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. తెలుగు లో ధృవ మూవీ లో రామ్ చరణ్ హీరోగా నటించిన సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా మోహన్ రాజా , చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ అయినటువంటి లూసీఫర్ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీ నిన్న అనగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే మోహన్ రాజా తన తదుపరి మూవీ ని రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ధ్రువ మూవీ కి సీక్వెల్ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: