రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి మూవీ కి ముందు వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కొనసాగిన ప్రభాస్ "బాహుబలి" మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో  క్రేజ్ ని సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కూడా ప్రస్తుతం భారీ బడ్జెట్ తో నిర్మాణం చెందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో ,  అంతకు మించిన మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సలార్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సలార్ మూవీ సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్  "సలార్" మూవీ ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: