ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల అయోధ్యలో ఎంతో గ్రాండ్ గా విడుదలైన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ తో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రూపొందిన ఈ సినిమా 500 కోట్ల బడ్జెట్ తో రూపొందడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపిస్తూ ఉండగా సీతగా కృతీ సనన్,  రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.  మొదటినుంచి ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోవడానికి కారణం ఈ చిత్రం 500 కోట్ల భారీ స్థాయిలో నిర్మాణం అవుతున్న సినిమా కావడమే.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం యొక్క అప్డేట్ ల కోసం ఎంతగానో ఎదురు చూసిన ప్రేక్షకులు తాజాగా విడుదలైన టీజర్ ను చూసి కాస్త పెదవి విరుస్తున్నారు అన్న వార్తలు ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాయి. సినిమా మొత్తం యానిమేటెడ్ చిత్రంగా ఉండడం, ఇందులో హీరో కి తగ్గ ఎలివేషన్స్ లేకపోవడం వంటివి జరగడంతో ఈ టీజర్ పై చాలామంది అభిమానులు పెదవిస్తున్నారు. సినిమా పై బజ్ లేకపోవడమే ఈ సినిమాకు సంబంధించిన త్రీడీ టీజర్ విడుదల చేసి సినిమాపై బ పెంచే విధంగా చేశారు అని మరి కొంతమంది చెబుతున్నారు.

పాన్ ఇండియా హీరోగా ఎదిగిన తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. భారీ బడ్జెట్ సినిమా గా తెరకెక్కడంతో ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అనుకున్న స్థాయిలో ఆ సినిమాలు అలరించకపోవడంతో ఇప్పుడు చేసే సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భావించారు. అయితే మొదటి ప్రయత్నంగా సినిమాపై క్రేజ్ తెచ్చిన తెచ్చే పనిలో ఉన్న చిత్ర బృందం ఈ విధమైన స్పందన ఎదుర్కోవడం నిజంగా అందరిని ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను బాధపెట్టే విషయం అనే చెప్పాలి . మరి ఈ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా..మరి ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంటుందా అనేది తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వేచి చూడవలసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: