టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు  ప్రధాన పాత్రలో నటిస్తుండగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఎస్ఎస్ఎంబీ 28'.ఇప్పటికే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. రీసెంట్ గా మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణంతో పోస్ట్ పోన్ చేశారు. త్వరలోనే మళ్లీ చిత్రం ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ లో రామోజీ ఫిల్మ్ సిటీలోనే యాక్షన్ సీక్వెన్స్ తో చిత్రీకరణను ప్రారంభించారు. ఈ మూవీ కోసం మహేశ్ బాబు కొత్త లుక్ లోకి మారాడు. కొద్దిపాటి మీసాలు, గడ్డంతో మాస్ లుక్ తో అలరించనున్నాడు. అయితే చిత్రంపై తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది.
చిత్ర నటీనటు ఎంపికను మేకర్స్ ఇప్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మహేశ్ బాబు సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే నటిస్తున్న విషయం అధికారికంగానే ప్రకటించారు. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం 'ఎస్ఎస్ఎంబీ28' కోసం మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు. ఇటీవల లైగర్ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ బ్యూటీ అనన్య పాండేనే. విజయ్ దేవరకొండ సరసన నటించిన కుర్ర హీరోయిన్ ప్రస్తుతం మహేశ్ బాబు సరసన కూడా నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్దేనే ఉంటుందని తెలుస్తోంది. కథ ఆధారంగా వచ్చే స్పెషల్ సాంగ్ కోసం మాత్రమే అనన్య పాండేను ఎంపిక చేశారని సమాచారం. దీనిపై మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఏదేమైనా 'ఎస్ఎస్ఎంబీ28'లో స్పెషల్ సాంగ్ ఉండబోతుందని అర్థం అవుతోంది. దీంతో అభిమానులు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా అని అర్థమవుతోంది. మరోవైపు పదేండ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావడం పట్ల సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: