సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా విజయవంతంగా పూర్తి అయింది. ఈ మూవీ షూటింగ్ యాక్షన్స్ సన్ని వేషాలతో ప్రారంభం అయింది.

మరికొన్ని రోజుల్లో ఈ మూవీ రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ లో పూజ హెగ్డే కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  ఈ మూవీ కథ ప్రకారం ఈ మూవీ లో మరొక హీరోయిన్ కి కూడా స్కోప్ ఉన్నట్లు ,  దానితో ఈ మూవీ యూనిట్ ఈ మూవీ లో మరో హీరోయిన్ ని తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ,  అందులో భాగంగా లైగర్ మూవీ తో ఎంత మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న అనన్య పాండే ను ఈ మూవీvలో సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: