ఐదు దశాబ్దాలుగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 80వ ఏటా అడుగుపెట్టారు. ఈ ప్రత్యేకమైన రోజున అమితాబ్ - జయ ఆలయాలను సందర్శించుకొని దేవుడిని దర్శించుకున్నారు.మరోవైపు ఆయన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు, కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఉదయమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా అమితాబ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం విశేషం.

తాజాగా ఆయన నటిస్తున్న భారీ చిత్రం 'ప్రాజెక్ట్ కే'  నుంచి అమితాబ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. '5 దశాబ్దాలకు పైగా అలరించిన పవర్‌హౌస్.. మీరు ఈసారి ప్రాజెక్ట్ కేలో ఆవిష్కరించిన కొత్త అవతార్‌ను ప్రపంచానికి చూపించడానికి వేచి ఉండలేకపోతున్నాం. మీ 80వ మరియు మరెన్నో పుట్టిన రోజులు మరింతగా గ్రాండ్ గా జరుపుకోవాలి. మీరు ఎప్పుడూ ఇలాగే శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండాలని , మా వెన్నంటే ఉండి మాలోనూ శక్తిని నింపాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రాజెక్ట్ కే టీం తరుపున అమితాబ్ బచ్చన్ సర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాం' అంటూ  విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు. బర్త్ డే స్పెషల్ పోస్టర్ గా ఆయన విజయానికి సంకేతంగా మూవీ నుంచి అబితాబ్ బచ్చన్ పిడికిలి చేతిని చూపించారు. పోస్టర్ బట్టిచూస్తే నాగ్ అశ్విన్ బిగ్ బీని నెక్ట్స్ లెవల్ లో చూపించబోతున్నారని అర్థం అవుతోంది.భారీ బడ్జెట్ తో తెలుగులో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రాజెక్ట్ కే'. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెప్రభాస్ సరసన నటిస్తోంది. కీలక పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం మూవీ చత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. పాన్ వరల్డ్ స్థాయిలో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.600 కోట్లతో సినిమాను నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: