సీతారామం సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న మృణాల్ ఠాకూర్‌ తాజాగా నాచురల్ స్టార్ నాని తో కలవడం జరిగింది.
వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాని మరియు మృణాల్‌ కలవడానికి కారణమేంటి..

వీరిద్దరూ కలిసి ఏమైనా సినిమాలో నటిస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియా సమాచారం ప్రకారం సీతారామం సినిమా సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు హను రాఘపూడి ఒక పార్టీ ఇవ్వడం జరిగిందట.

ఆ పార్టీలో హను రాఘవపూడికి స్నేహి తుడైన హీరో నాని పాల్గొ న్నారు. అదే సమయంలో వీరిద్దరిలా ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు అనేది టాక్, అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక నాని సినిమాల విషయా నికొస్తే శ్యామ్ సింగరాయ్‌ తో మంచి వి జయాన్ని సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం దసరా సినిమా షూటిం గ్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాను ఒక వి భిన్నమైన సినిమాగా ప్రేక్షకుల ముం దుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు.

అంతే కాకుండా నానిని ఇప్ప టి వరకు చూడని విధంగా  చూపించ బోతున్నట్లుగా తెలు స్తోంది. ఊర మాస్ పాత్రలో చూపించ బోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. భారీ అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. సినిమాకు సంబంధించి న విడుదల తేదీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఇక మృణాల్‌ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని దక్కించుకుంది, కనుక త్వరలో నే తెలుగులో ఈమె స్టార్ హీ రోలకు జోడిగా మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరిని ఇలా చూసిన జనాలు వీరిద్ద రూ కలిసి ఒక సినిమాలో నటిస్తే బాగుం టుంది కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్‌ లో సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: