తగ్గేదేలే అంటూ బన్నీతో నీరజ్ చోప్రా సందడి?
దేశం గర్వించదగ్గ వ్యక్తి
ఇండియన్ స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' ఈవెంట్లో తళుక్కున మెరిశారు. భారత
రాజధాని ఢిల్లీ వేదికగా సీఎన్ఎన్ న్యూస్-18 ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన ఈవెంట్లో నీరజ్ చోప్రాతో పాటు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ సహా మరికొంత మంది ప్రముఖులు కూడ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో అల్లు అర్జున్ పాన్
ఇండియా సినిమా పుష్ప సినిమాకు ''ఇండియన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డు అందుకోగా.. ఆ తర్వాత క్రీడా విభాగంలో నీరజ్ చోప్రా ఈ అవార్డు తీసుకున్నాడు.
నీరజ్ చోప్రా, బన్నీలు ఒకే వేదికను పంచుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజిచ్చిన అనంతరం తనివీ తీరా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్ 'తగ్గేదే లే' మేనరిజంను చేసి చూపించాడు. ఆ సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడే ఉండడంతో ఇద్దరు కలిసి తగ్గేదే లే అంటూ ఫోజిచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో కలిసి స్టేజీపై డ్యాన్స్తో అదరగొట్టాడు నీరజ్ చోప్రా.
వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి.ఈ మధ్యనే నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ట్రోఫీని తొలిసారి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ట్రోఫీ కొల్లగొట్టాడు. 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్కు నీరజ్
అర్హత సాధించినప్పటికి ట్రోఫీ కొట్టేలేకపోయాడు. ఈసారి మాత్రం ట్రోఫీ అందుకున్న నీరజ్ చోప్రా వచ్చే ఏడాది
హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ బెర్తును ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకున్నాడు.