హీరోయిన్ లు ఎవరూ కూడా తమకు వచ్చిన అవకాశాలను పక్కన పెట్టేయరు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల అవకాశాలు వస్తే ఎగిరి గంతేస్తారే తప్ప దానిని రిజెక్ట్ చేయరు. తమ పాత్ర ఎలా ఉన్నా కూడా స్టార్ హీరోల సరసన కనిపిస్తే చాలు తమకు తమ కెరియర్ కు అది ఎంతగానో ఉపయోగపడుతుంది అని నమ్మే హీరోయిన్లు ఉన్న టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒక విచిత్రమైన ప్రచారం జరుగుతూ ఉంది.

హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు మాస్ మసాలా సినిమాలు చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమా లో ఆమె నటించిన తీరు దాన్ని స్పష్టం చేస్తుంది.  అంతకు ముందు ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలను కేవలం మీడియం రేంజ్ హీరోల సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు తన పంథా మార్చి అగ్ర హీరోల సరసన గ్లామర్ హీరోయిన్ గా కనిపించేందుకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందన్న వార్తలు ఆ మధ్య ఎక్కువగా వినిపించాయి. అయితే ఆ సినిమాను ఆమె రిజెక్ట్ చేసింది అన్న వార్తలు కూడా అంతకంటే ఎక్కువగా వినిపించాయి.

అయితే ఆమె సన్నిహితులు చెబుతున్న వార్తల ప్రకారం ఇలాంటి వదంతులు రావడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుందని చెప్పాలి. వాస్తవానికి ఆ సినిమా వస్తే తప్పకుండా కీర్తి సురేష్ ఒప్పుకుంటుందని రిజెక్ట్ చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదు అని వారు వెల్లడిస్తున్నారు. ఏదేమైనా కీర్తి సురేష్ కెరియర్ ఇంకా ముందుకు పోవాలి అంటే అగ్ర హీరోయిన్ గా పాతుకు పోవాలి అంటే ఈ సినిమా చేయవలసింది అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. వాస్తవానికి ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా పెద్దగా ఏమీ లేని నేపథ్యంలో ఈ సినిమా ఒప్పుకుని చేస్తే ఆమెకు లాభమే తప్ప నష్టమేమీ లేదని కొంతమంది చెబుతున్నారు. మరి త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టకపోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఎంపిక అవుతారు చూడాలి. ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ ఉంటుంది అని వార్తలు ప్రచారం అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: