ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ చిత్రం ప్రేక్షకులను వేరే స్థాయిలో అలరిస్తుందని చిత్ర బృందం గట్టిగా చెబుతూ ఉండడం అందరిలోనూ ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది. గత రెండు సినిమాలగా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్న ప్రభాస్ ఈ మైథాలజికల్ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించి తిరిగి ఫామ్ లోకి రావాలని ఆయన భావిస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై ప్రత్యేకమైన ఫోకస్ ప్రభాస్ నిర్వహించాడు అని చెప్పాలి.

ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యొక్క టీజర్ ఇటీవల విడుదల కాగా చాలామంది ఈ సినిమా టీజర్ ను చూసి పెదవి విరిచారు. ఒక యానిమేషన్ సినిమా చూసినట్లుగా ఉందని వారు వాపోయారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా టీజర్ ఇలా ఉండడం పట్ల ఎంతో నిరాశపడ్డారు. దాంతో ప్రభాస్ ఈ సినిమాకు త్రీడి టీజర్ ను మళ్ళీ విడుదల చేసి వచ్చిన నెగెటివిటీని కొంతవరకు పాజిటివ్ గా మార్చే ప్రయత్నం చేశాడు.

కానీ చాలామందిలో అభిప్రాయం మాత్రం ఇంకా మారలేదని చెప్పాలి. ఈ సినిమా యొక్క టీజర్ యొక్క నెగెటివిటీ సినిమాపై ఖచ్చితం గా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రభాస్సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను వినూత్నంగా చేయాలని భావిస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా సినిమా పట్ల పాజిటివ్ వైబ్స్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. మరి వరుసగా రెండు భారీ ఫ్లాప్ ల తర్వాత ఈ హీరో ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, సీత గా కృతి సనన్ నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. సలార్ సినిమా ను కూడా విడుదల చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: