పాన్ ఇండియా మార్కెట్ దగ్గర మోస్ట్ అవైటెడ్ చిత్రం ఏదైనా ఉంది అంటే అది ముందుగా మన డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ అనే చెప్పాలి.. ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా వ్యాప్తంగా ఉండడంతో ఎప్పుడెప్పుడు ఈయన సినిమా వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ అంతా అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు.


బాహుబలి తర్వాత ప్రభాస్ నిరాశ పరచడంతో ఇప్పుడు రాబోయే నెక్స్ట్ సినిమాపై అందరి దృష్టి పడింది.


మరి ఈయన సినిమాల్లో ముందుగా ఆదిపురుష్ నే రాబోతుంది.. వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో బరిలోకి దిగబోతున్న ఈ సినిమాకు ప్రొమోషన్స్ జోరుగా చేస్తున్నారట.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి హవా చూపిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.


ఒక విషయంలో ఆదిపురుష్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది అంటూ తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.. గత నెల రోజుల్లో ఈ సినిమాను అత్యధికంగా వెతకబడిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పిందట.. ఈ విషయంలో ఆదిపురుష్ టాప్ లో నిలిచినట్టు చెప్పడంతో ఈ సినిమా క్రేజ్ ఎంత ఉంది అనేది అర్ధం అయ్యేలా చేసారట..


ఇక ఆదిపురుష్ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించారు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న రిలీజ్ కానుంది.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.. సీతగా కృతి సనన్ నటిస్తుంది.. లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.. లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడట. చూడాలి మరి ఈ సినిమాతో ఏ రేంజ్ లో వారు ప్రేక్షకులను మెప్పిస్తారో

మరింత సమాచారం తెలుసుకోండి: