రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా , కృతి సనన్మూవీ లో సీత పాత్రలో కనిపించబోతుంది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొంత కాలం క్రితమే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ప్రభాస్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను మరియు ఈ మూవీ నుండి ఒక టీజర్ ను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు అనే విషయం మనకు తెలిసిందే. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆది పురుష్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అదిరి పోయే అప్డేట్ ను విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆది పురుష్ మూవీ నుండి మొదటి పాటను విడుదల చేయాలి అని మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతుంది. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: