దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఇప్పటికే తన కెరియర్ లో దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోనూ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని.  ప్రస్తుతం ఇండియా లోనే టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" అనే పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా ఆలియా భట్ ,  ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా నటించారు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ "ఓ టి టి" లో విడుదల అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి ఆదరణ లభించింది. ఇలా "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి మరి కొంత కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నాడు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న కార్తి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మహేష్ బాబు సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించబోతున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: