దాదాపుగా రెండు సంవత్సరాల విరామం తర్వాత శిరీష్ రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ చిత్రమే ఊర్వశివో రాక్షసివో.. ఈ చిత్రాన్ని మలయాళం లో దుల్కర్ సల్మాన్ ఏబిసిడి చిత్రంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా నే ప్రేక్షకుల ముందుకు అల్లు శిరీష్ తీసుకురాబోతున్నారు. విజేత సినిమా డైరెక్టర్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 4 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ పనులను చాలా వేగవంతం చేశారు.


ఈ సందర్భంగా తను ,అను ఇమ్మానుయేల్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా వచ్చినా వార్తలపై అల్లు శిరీష్ స్పందించడం జరిగింది. ముఖ్యంగా విడుదల చేసిన టీజర్ లో శిరీష్, అను ఇమ్మానియేల్ చాలా రెచ్చిపోయి రొమాంటిక్గా నటించడంతో ఈ విషయం మరింత వైరల్ గా మారింది. అయితే దీనిపై అల్లు శిరీష్ స్పందిస్తూ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో అలా బాగా కలిసి వచ్చిందని.. అయితే తామిద్దరి మధ్య ఎలాంటిది ఏమీ లేదని తెలియజేశారు కేవలం ఇవన్నీ ఇండస్ట్రీలో వదంతులు అని కొట్టి పారేశారు. కేవలం మేమిద్దరూ మంచి స్నేహితులమే అని తెలిపారు.


కొన్ని నెలల పాటు కలిసి పని చేయడం వల్ల మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని అంతేకాకుండా అను చాలా సైలెంట్ గా ఉంటుందని తెలియజేశారు. ఇక అలా మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉన్నాయి కాబట్టి మేమిద్దరం ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు శిరీష్. వర్క్ విషయంలో తను చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని అందువల్లే రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించిందని తెలియజేశారు. ఈ సినిమా చేసే సమయంలో సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను ఎంత చేత అంటే అందులో వచ్చే కామెంట్లు తనని చాలా ఫీల్ అయ్యేలా చేస్తాయని తెలిపారు శిరీష్.

మరింత సమాచారం తెలుసుకోండి: