పంత్ - ఊర్వశి : ఫేమస్ యంగ్ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్, ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ హాట్ బ్యూటీ ఊర్వశి ప్రేమలో ఉన్నారంటూ బి-టౌన్ లో ఎప్పటినుంచో ఎన్నో రకాల వార్తలు బాగా షికార్లు చేస్తూ ఆ వార్తలు దేశమంతా కూడా వినిపిస్తున్నాయి.అయితే ఈ మధ్య ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో.. వాటికీ పంత్ కూడా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించాడు.ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ.. “నేను ఢిల్లీ హోటల్ ఉన్నప్పుడు నన్ను కలవడానికి "మిస్టర్ ఆర్‌పి" వచ్చాడు. దాదాపు 10 గంటలపాటు హోటల్ లాబీలో ఎదురు చూసాడట, కానీ నేను నిద్రపోవడంతో కలవలేకపోయాను. విషయం తెలుసుకొని తరవాత ముంబై వెళ్లి కలిశానంటూ” చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలతో అభిమానులు రిషబ్ పంత్‌తో మళ్లీ లింక్ చేయడం ప్రారంభించారు. ఆ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడిన 'ఆర్పీ' మరెవరో కాదు, భారత క్రికెటర్ రిషబ్ పంత్ అని నెటిజన్లు కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు.


 రిషబ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. "కొంతమంది పాపులారిటీ కోసం ఇంటర్వ్యూలలో ఎలా అబద్ధాలు చెబుతారు. సొసైటీలో పేరు కోసం నువ్వు చేసే పని చూస్తుంటే ఫన్నీగా ఉంది అక్క" అని పోస్ట్ చేసినా, కొద్దిసేపటికే తొలగించాడు. ఇక దీనికి ఊర్వశి.. “చోటు నువ్వు బ్యాట్-బాల్ ఆడాలి, నాతో కాదంటూ” బదులిచ్చింది.తాజాగా ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. “ఇటీవల నేను పోస్ట్ చేసిన ఐ లవ్ యూ సెల్ఫీ వీడియో చాలా వైరల్ అయింది. అది కేవలం షూటింగ్ కోసం తీసిన డైరెక్టోరియల్ వీడియో మాత్రమే. అంతేగాని వీడియో కాల్ రికార్డింగ్ కాదు” అంటూ వివరణ ఇచ్చింది.వీళ్ళ గోల ఏందిరా బాబోయ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఇక్కడితో అయినా వీరిద్దరి రచ్చకి ముగింపు పడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: