మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే కెరియర్ పిక్స్ లో ఉన్న సమయం లోనే చిరంజీవి రాజకీయాల వైపు దృష్టి మళ్లించి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" మూవీ తో తిరిగి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

అప్పటి నుండి చిరంజీవి వరస మూవీ లలో నటిస్తూ కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం కూడా చిరంజీవి ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం మొదట చిరంజీవి "ఆచార్య" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  

ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి , మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు మరియు హిందీ భాషలో అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ ,  నయన తార కీలక పాత్రలలో నటించగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ఇప్పటి వరకు 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  ఈ 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ లో గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 57.89 కోట్ల షేర్ , 105.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: