సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె, ప్రముఖ నిర్మాత సౌందర్య రజనీకాంత్ మరో సారి తల్లి అయ్యారు. ఆదివారం ఆమె పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ సౌందర్య తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోస్ కూడా పోస్ట్ చేశారు. ఆ బిడ్డకి పేరు కూడా పెట్టేశారు. తన భర్త, తండ్రి పేరు కలిసి వచ్చే విధంగా 'వీర్ రజనీకాంత్ వనంగమూడి' అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సౌందర్య రజనీకాంత్ కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్తూ బిడ్డని దీవిస్తున్నారు. వీర్ తన వేలు పట్టుకుని ఉన్న ఫోటోని సౌందర్య పోస్ట్ చేశారు. ద

"దేవుని దయ, తల్లి దండ్రుల ఆశీర్వాదంతో 11/9/22 రోజున విషగన్, వేద్, నేను.. వేద్ తమ్ముడు వీర్ రజనీకాంత్ వనంగమూడికి ప్రేమతో స్వాగతం పలుకుతున్నాం. నాకు వైద్యం చేసిన డాక్టర్స్ సుమన మనోహర్, శ్రీ విద్య శేషాద్రికు కృతజ్ఞతలు" అని సౌందర్య రాసుకొచ్చారు. సౌందర్యకి అభిషేక్ బచ్చన్, శ్రియా శరణ్ తో పాటు పలువురు ప్రముఖులు అభినందలు తెలిపారు. తన పెద్ద కొడుకు వేద్, భర్త విషగన్ వనంగమూడితో కలిసి నవ్వుతూ ఉన్న ఫోటోతో పాటు.. వీర్ తన వేలిని పట్టుకుని ఉన్న ఫోటోస్ ఆమె పోస్ట్ చేశారు.ద

సౌందర్యకి ఇది రెండో వివాహం. మొదటి సారి ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కుమార్ తో వివాహం జరిగింది. వీళ్లిద్దరికి కలిపి వేద్ పుట్టాడు. ఏడేళ్ళ బంధం తర్వాత సౌందర్య, అశ్విన్ విడిపోయారు. 2019 లో సౌందర్య విషగన్ వనంగమూడిని రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ దంపతులకి వీర్ జన్మించాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మాత, దర్శకురాలిగా తన ప్రతిభని నిరూపించుకుంటున్నారు. 'బాబా', 'చంద్రముఖి', 'శివకాశి', 'మజా', 'పందెం కోడి', 'శివాజీ' చిత్రాలకి సౌందర్య గ్రాఫిక్ డిజైనర్ గా పని చేశారు. 'కథానాయకుడు' సినిమాలో గెస్ట్ రోల్ చేసి మెప్పించారు. అంతే కాదు 'గోవా' చిత్రానికి నిర్మాతగా వహించారు. తండ్రి రజనీకాంత్ యానిమేషన్ చిత్రం 'కొచ్చాడియాన్' సినిమాకి దర్శకత్వం చేశారు. కానీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇవే కాదు ధనుష్ తో కలిసి 'వీఐపీ2' సినిమాను తెరకెక్కించారు

మరింత సమాచారం తెలుసుకోండి: