యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆదిపురుష్‌ సినిమా కూడా ఒకటి. బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. రామాయణ ఇతిహాస కావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటిస్తుండగా, రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ విడుదలైన తర్వాత పై నెగిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఓవైపు ఈ సినిమాలో వీఎఫెక్స్‌ బాగాలేదంటూ, మరోవైపు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత చిత్ర యూనిట్‌ 3డీ వెర్షన్‌ను విడుదల చేయడం, దర్శకుడు ఇచ్చిన స్పష్టతతో మళ్లీ పాజిటివ్‌ వైబ్స్‌ వచ్చాయి.ఇదిలా ఉంటే ఆదిపురుష్‌ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.


అయితే తాజాగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఆదిపురుష్‌ వాయిదా పడనున్నట్లు సమాచారం తెలుస్తోంది. దీనికి కారణంగా సంక్రాతి బరిలో తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, ఏజెంట్ చిత్రాలు ఉండడమే. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోలు బరిలో ఉండడం వల్ల ఆదిపురుష్‌ను రెండు వారాలకు వాయిదా వేయాలనే ప్రపోజల్స్‌ వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది.అయితే మరోవైపు ఆదిపురుష్‌ టీమ్‌ మాత్రం సినిమాను వాయిదా వేసే ఆలోచనలో లేదని తెలుస్తోంది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సంక్రాంతికే సినిమాను విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారని టాక్‌. ఇంతకీ ఆదిపురుష్‌ అనుకున్న సమయానికి వస్తాడా.? లేదా వాయిదా పడనుందా.? తేలాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే.మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో.కానీ ఫ్యాన్స్ మాత్రం కన్ఫ్యూజన్ లో వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: