దేశవ్యాప్తంగా అందరిని ఆకట్టుకుంటున్న కన్నడ చిత్రం కాంతారా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలన విజయాలను అందుకుంటోంది. ఇక ఈ సినిమా తీసుకున్న బయర్లకు కూడా మంచి లాభాలను అందిస్తోంది. ఈ సినిమాని తెలుగులో నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే పెట్టుబడులు పెట్టిన వాటిలో దాదాపుగా అన్ని ఏరియాలలో కూడా భారీగానే లాభాలు అందిస్తున్నది. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. ఇక మిగతా భాషలలో కూడా ప్రతిరోజు కలెక్షన్ల పరంగా పెరుగుతూనే ఉన్నట్లు సమాచారం.


అయితే తాజాగా ఇతరుణంలో ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా చూసి ఒక వ్యక్తి మరణించినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తి సినిమా థియేటర్లో కాంతారా సినిమాలు చూస్తూ ఒక్కసారిగా కూర్చున్న సిటీలోనే కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి.కర్ణాటకలోని బాగా మంగళ ప్రాంతానికి చెందిన రాజశేఖర్ అని 45 ఏళ్ల వ్యక్తి ఈ చిత్రాన్ని చూస్తూ కుర్చీలో ఉన్న సీట్లోనే ఒకసారిగా కుప్పకూలిపోయారట. అయితే ఆ వ్యక్తి అలా కింద పడడంతో థియేటర్ యాజమాన్యం వెంటనే హాస్పిటల్ లోకి తరలించారు.


అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు.గుండెపోటు కారణంగానే అతను కన్నుమూసినట్లుగా తెలుస్తోంది అయితే ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నది. ఎంతో సంతోషంగా సినిమా చూడడానికి వెళ్లిన రాజశేఖర్ విగతజీవిగా ఇంటికి ఒక అంబులెన్స్ లో రావడంతో తమ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం కాంతారా చిత్రం రూ.200 కోట్లకు రూపాయలకు పైగా కలెక్షన్లు అందుకుంటూ విజయ దిశగా దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: