ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడుగా పరిచయమై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు నాగ్ అశ్విన్. తొలి సినిమాతోనే సామాజిక స్పృహ ఉన్న సినిమాను చేసి అందరిని ఎంతగానో ఆలోచింపజేసేలా చేసిన ఈ దర్శకుడు తప్పకుండా మంచి అభిరుచి గల దర్శకుడుగా ఎదుగుతాడని ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఆ విధంగా ఆయన చేసిన రెండో సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.

ఆ విధంగా మహానటి సినిమా ఓ గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టి ఈ దర్శకుడుని అగ్ర దర్శకుడిగా మార్చివేసింది. ఈ సినిమా అంతటి పెద్ద విజయం అందుకోవడం తో ఆ తరువాత ఆయన చేయబోయే మూడవ సినిమాపై ప్రేక్షకులలో ఎంతగానో ఆసక్తి ఏర్పడింది అని చెప్పాలి. ఆ ఆసక్తి కి తగ్గట్లు గానే ఈ దర్శకుడు ప్రభాస్ తో సినిమా ఓకే చేశాడు. భారీ పాన్ ఇండియా సినిమా అయినా ప్రాజెక్టు కే సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు. 

500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా యొక్క  షూటింగ్ కూడా ఇప్పటికే మొదలయ్యింది. చాలా భాగం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం రామోజీ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ఈ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని ఇద్దరికీ తెచ్చిపెడుతుంది అని అందరూ భావిస్తున్నారు. తన ప్రతి సినిమాలో ఒక మంచి అంశాన్ని తెరపై చూపించి సక్సెస్ అవుతున్న ఈ సినిమాను కూడా ఆ విధంగానే చూపించ బోతున్నాడట. భవిష్యత్తు కాలంలో జరిగే ఈ చిత్రంలో ఆయన ప్రభాస్ ను కొత్తగా చూపించబోతున్నాడని చెబుతున్నారు. ఆ విధంగా నాగ్ అశ్విన్సినిమా ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని దర్శకుడిగా మరో మెట్టు ఎక్కుతాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: