ధోనీ నిర్మిస్తున్న ఫస్ట్ మూవీలో నటినటులు వీరే?

మాజీ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ  ప్రకటనల తయారీ ఇంకా అలాగే టీవీ మార్కెటింగ్ కంపెనీ "ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్"(DEPL) సినిమాల ప్రపంచంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోందని చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఈ వెంచర్‌కు సంబంధించి ఇప్పటికే కొంతమంది అగ్ర తారలు మరియు కొంతమంది దర్శకుల పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా ఇప్పుడు అధికారికంగా DEPL కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది.దీపావళి ముందురోజు, DEPL, "అథర్వ-ది ఆరిజిన్" అనే గ్రాఫిక్ నవలను రచించిన సంగీత స్వరకర్త రమేష్ తమిలమణితో జతకడుతున్నట్లు ప్రకటించింది. ఆయన ఈ తమిళ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు. ధోనీ భార్య సాక్షి కథను అందించారని మరియు ఆమె తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా డబ్ చేయబడుతుంది.


తాజా సమాచారం ప్రకారం ధోని నిర్మించబోయే తొలి చిత్రంలో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లు హీరో హీరోయిన్ లుగా నటించనున్నట్లు తెలుస్తోంది.హరీష్ కళ్యాణ్ తమిళంలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో నాని నటించిన "జెర్సీ" సినిమాలో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రియాంక మోహన్ హీరోయిన్ గా ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆమె ఒక స్టార్ హీరోయిన్. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం పేరున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ధోని నుంచి రాబోయే తొలి చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.ఇక మూవీ ప్రొడక్షన్ రంగంలో అడుగుపెట్టిన ధోని మున్ముందు ఎలా సక్సెస్ అవుతాడనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: