పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా హీరోగా నటించాడు. భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా ఈ సంవత్సరం ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయినటు వంటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతున్న మధ్యలో పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" మూవీ పై ఇంట్రెస్ట్ చూపించడం ,  అలాగే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి "కొండపోలం" మూవీ కి దర్శకత్వం వహించడం తో ఈ మూవీ కొన్ని రోజుల పాటు నిలిచి పోయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల కోసం వర్క్ షాప్ ను కూడా నిర్వహించింది. ఈ వర్క్ షాప్ పనులు కూడా కొన్ని రోజుల క్రితమే ముగిసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ అప్డేట్ కు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది.

హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఈ రోజు నుండి రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా షెడ్యూల్ 10 నుండి 15 రోజుల పాటు జరగనున్నట్లు సమాచారం. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నిధి అగర్వాల్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా  , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: