తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో వంశీ పైడిపల్లి ఒకరు. వంశీ పైడిపల్లి , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తరికెక్కిన మున్నా మూవీ తో దర్శకుడి గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. మున్నా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ ద్వారా వంశీ పైడిపల్లి కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు బృందావనం , ఎవడు , ఊపిరి ,  మహర్షి వంటి మూవీ లకు దర్శకత్వం వహించాడు. వంశీ పైడిపల్లి సినిమా ...  సినిమాకు మధ్య గ్యాప్ చాలా వరకు తీసుకున్నప్పటికీ తను దర్శకత్వం వహించిన సినిమాలు మాత్రం చాలా వరకు విజయాలను సాధించాయి. దానితో వంశీ పైడిపల్లి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వంశీ పైడిపల్లి కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు  ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు లో విడుదల కానుంది. తమిళ్ లో ఈ మూవీ వరీసు పేరుతో విడుదల కానుండగా ,  తెలుగు లో ఈ మూవీ వారసుడు పేరుతో విడుదల కానుంది. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... వారిసు మూవీ ఒక తమిళ సినిమా.  ఇది తెలుగులో  డబ్ అయ్యి విడుదల అవుతుంది అని తాజాగా వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చాడు.  వారసు మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: