పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా రూపొందుతుంది. తొందర్లోనే ఈ సినిమా యొక్క షూటింగ్ ను పూర్తి చేసి విడుదలకు రంగం సిద్ధం చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మెగా అభిమానులలో ఎంతగానో ఆశలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ నటులు చాలామంది ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఈ భారీ చిత్రాన్ని తొందర్లోనే పూర్తి చేసి తన తదుపరి సినిమాలకు వెళ్లాలని భావిస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉండడంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాలను చకచగా చేసేసి అభిమానులను అలరించాలని ఆయన భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోయిన ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటివరకు ఆయన రెండు సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కావడం విశేషం. ఎక్కువగా రీమేక్ సినిమాలతో అలరించిన పవన్ కళ్యాణ్ ఒక స్త్రైట్ సినిమాతో ఆలోచించాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు. 

అందులో భాగంగానే హరిహర వీరమల్లు రూపొందుతుంది. అంతేకాదు ఆ తరువాత ఆయన చేయబోయే సినిమాలు కూడా రీమేక్ సినిమాలు కావద్దు అని వారు చెబుతున్నారు కానీ తమిళంలో సూపర్ హిట్ అయినా వినోదాయ సీతం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఆయన రీ ఎంట్రీ లో మూడు రీమేక్ సినిమాలు చేసినట్లుగా అవుతుంది. ఆ విధంగా ఆయన రీ ఎంట్రీలో డైరెక్ట్ సినిమాలు కాకుండా మూడు రీ ఎంట్రీ సినిమాలు చేయడం నిజంగా ఎంతో ఇబ్బందికరమైన విషయం అనే చెప్పాలి. అభిమానులను ఇది ఎంతగానో నిరుత్సాహపరుస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో ఈ విధంగా సినిమాలు చేయడం నిజంగా ఆయన అభిమానులను నిరుత్సాహపరుస్తుంది. త్వరలోనే ఆయన చేయబోతున్న హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి ఆ చిత్రం ఆయన అభిమానులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: