మళ్లీ రావా సినిమాతో దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు గౌతమ్ తిన్ననూరీ తొలి సినిమాతోనే ఫీల్ గుడ్ దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ దర్శకుడు తప్పకుండా దర్శకుడు అవుతాడని ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఆ విధంగా అందరూ భావించినట్లుగానే ఈ దర్శకుడు జెర్సీ సినిమాతో ప్రేక్షకులను మరొకసారి భారీ స్థాయిలో అలరించాడు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అని చెప్పాలి.


సినిమాల్లో ఎంత బాగా చేస్తాడో అందులోని ఎమోషన్స్ ను కూడా అంతే బాగా పలికిస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే వచ్చాడు ఆ విధంగా జెర్సీ సినిమా సంచలన విజయం అందుకున్న తరువాత ఆయన తెలుగులో కాకుండా అదే సినిమాను బాలీవుడ్ లో చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ చిత్రానికి భారీ స్థాయిలోనే పేరు వచ్చింది. మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తరువాత గౌతమ్ తెలుగులో రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే చాలా రోజుల తర్వాత ఈ సినిమాను రామ్ చరణ్ రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఆ కథను విజయ్ దేవరకొండకు చెప్పి ఒప్పించాడు. 

తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఈ సినిమాకు ఎవరు నిర్మాతగా వ్యవహరిస్తారు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో కొన్ని మార్పులు విజయ్ దేవరకొండ సూచించినట్లుగా తెలుస్తుంది. ఆ మార్పులు చేస్తే తప్పకుండా సినిమా బాగుంటుందని ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తుందని భావిస్తున్నారు ఏదేమైనా గౌతమ్ తిననూరి కథలో ఆ మార్పులు కనుక చేసి విజయ్ దేవరకొండ ను ఒప్పించగలిగితే ఈ ఓ భారీ ప్రాజెక్టు సెట్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న ఖుషి సినిమా త్వరలోనే పూర్తి కావాల్సిన నేపథ్యంలో ఆ తర్వాత చిత్రంగా ఈ సినిమాను చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: