ప్రస్తుతం
టాలీవుడ్ లో చేస్తున్న చాలామంది హీరోలు
బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి అక్కడ విజయాన్ని సాధించి నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. పాన్
ఇండియా సినిమాల ద్వారా ఒకవైపు అలరిస్తున్న
టాలీవుడ్ హీరోలు ఇంకొక వైపు బాలీవుడ్లో డైరెక్ట్ సినిమాలు చేసే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అలాంటి వారి యొక్క జాబితా ఇప్పుడు రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు
విజయ్ దేవరకొండ చేరడం మరింత విశేషం .
ఇటీవల ఆయన హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన లైగర్
సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. పాన్
ఇండియా ప్రాజెక్టుగా వచ్చిన ఈ
సినిమా ద్వారా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించగా
విజయ్ దేవరకొండ ఇప్పుడు తన తదుపరి సినీమాతో అందరినీ అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం
శివ నిర్వాణ దర్శకత్వంలో
ఖుషి అనే సినిమాను చేస్తున్న
విజయ్ దేవరకొండ ఆ తరువాత మరి కొంతమంది
యువ దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఓ
బాలీవుడ్ సినిమా చేసే విధంగా అడుగులు వేస్తున్నారు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఈ హీరోతో
సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారట. లైగర్ సినిమాతో ఆయనకు అక్కడ ప్రేక్షకులలో మంచి డిమాండ్ పెరిగిపోయింది. అంతకుముందే
అర్జున్ రెడ్డి సినిమాతో ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడగా లైగర్ సినిమాతో అది రెట్టింపు అయిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అక్కడ
విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది నిర్మాతలు
బాలీవుడ్ దర్శకులతో కథలు చెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి తొందరలోనే ఆయన చేయబోయే
బాలీవుడ్ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి. తెలుగులో ఆయన ఒకేసారి ఈ రెండు సినిమాలు చేసే విధంగా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతూ ఉండగా
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా మరొక సినిమాను చేయడానికి రెడీగా ఉన్నాడు.
విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి మొదలు కాబోతున్నాయి.