టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన భింబిసారా చిత్రం ఇటీవలే విడుదలై ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..ఇక వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సరికొత్త ఊపిరిని పొయ్యడమే కాకుండా కళ్యాణ్ రామ్ ని హీరో గా మరియు నిర్మాతగా మరో లెవెల్ కి తీసుకెళ్లింది ఈ చిత్రం..అయితే సుమారు 40 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని..అంతేకాదు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సినిమా విడుదల సమయం లోనే ప్రకటించాడు కళ్యాణ్ రామ్.

ఇకపోతే వచ్చే ఏడాది నుండి ప్రారంభం కాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ లో ఒక లేటెస్ట్ న్యూస్ హల్చల్ చేస్తుంది..ఇక భింబిసారా సినిమానే కళ్యాణ్ రామ్ తన మార్కెట్ రేంజ్ కి మించిన బడ్జెట్ తో తీసి రిస్క్ చేసాడు.. బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ కి ఏ రేంజ్ లో ఉంటుందో ప్లాన్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇదిలావుంటే ఈ సీక్వెల్ ని వంద కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఘనంగా తియ్యబోతున్నాడట కళ్యాణ్ రామ్..అంతే కాకుండా తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఈ సినిమాలో నటింపచేస్తున్నాడట..

అయితే ఎన్టీఆర్ కి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక ఎన్టీఆర్ ఒక్కసారి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టాడంటే దాని రేంజ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ నుండే వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది..కాగా ఆ స్థాయి క్రేజ్ ఉన్న స్టార్ ఆయన..అందుకే ఖర్చుకి వెనకాడకుండా కళ్యాణ్ రామ్ ఈ సినిమాని తీస్తున్నట్టు సమాచారం.ఇకపోతే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఒక వారియర్ రోల్ లో నటించబోతున్నాడట.అయితే .అన్నదమ్ములు కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలనే కోరిక తో ఉన్న నందమూరి ఫాన్స్ కి ఈ వార్త పండుగ లాంటిది అనే చెప్పాలి..ఇకఈ క్రేజీ కాంబినేషన్ ఎన్ని అద్భుతాలు సృష్టించబోతుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరుకు ఓపిక పట్టాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: