ప్రభాస్ హీరోగా పలు సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. ఇదివరకే పూర్తి చేసిన
బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్
ఆది పురుష్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.
సంక్రాంతి కానుకగా ఈ సినిమాను
జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం మొదలు పెట్టింది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి గుర్తింపు దక్కింది.
ఈ నేపథ్యంలోనే ఈ
సినిమా తరువాత విడుదల చేయబోయే సినిమాలపై
ప్రభాస్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో
ప్రభాస్ ఇప్పటికే మొదలుపెట్టిన సలార్ చిత్రాన్ని పూర్తి చేసే విధంగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఈ
సినిమా యొక్క షూటింగ్ ను ఆయన మొదలుపెట్టారు. ఇంకొకవైపు ప్రాజెక్టు కే సినిమాను చేస్తూ
మారుతి దర్శకత్వంలో సినిమాను కూడా షూటింగ్ చేస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు సలార్ చిత్ర షూటింగ్ లో
సినిమా చేస్తూ ఉండడం నిజంగా
ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆనందపరిచే విషయం అనే చెప్పాలి.
ఎందుకంటే ఒకేసారి మూడు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను తక్కువ వ్యవధిలోనే అలరించడానికి
ప్రభాస్ తన సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు సలార్ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి ఆయన రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాను విడుదల చేస్తాడా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
శృతిహాసన్ ఈ సినిమాలో కథానాయకగా నటిస్తూ ఉండగా పాన్
ఇండియా స్థాయిలో ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కే జి ఎఫ్
సినిమా తర్వాత చేస్తున్న
సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ
సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
ప్రభాస్ ఇప్పుడు ఓ భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.