పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఇప్పుడు చాలామంది హీరోలు వెనకడుగు వేస్తున్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతున్నాయి. ఆయన గత సినిమా లైగర్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించకపోవడంతో ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది అని చెబుతున్నారు. వాస్తవానికి పూరి జగన్నాథ్ కి ఇలాంటి పరిస్థితి రావడం కొత్తేమీ కాదు ఎప్పటికప్పుడు ఇలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఒక హిట్ సినిమాను తీసుకు వచ్చేవాడు.

 అయితే ఈసారి లైగర్ సినిమా ఆయనకు భారీ స్థాయిలోనే దెబ్బేసింది అని చెప్పాలి. ఏదేమైనా దర్శకుడుగా కన్సిస్టెన్సీ లేకపోవడం పూరి జగన్నాథ్ ను వైఫల్య పరుస్తుంది. ఇతర దర్శకులు సినిమా పట్ల ఎంతటి జాగ్రత్తతో చేస్తున్నారో అలాంటి జాగ్రత్త పూరి జగన్నాథ్ లో కనిపించదు అని చెప్పాలి. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్టును చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకున్నాడు. మొదట్లో ఓ హీరోని అనుకున్నప్పటికీ ఇప్పుడు ఆ హీరో చేయకపోవడంతో ఈ సినిమా కోసం మరొక హీరోని వెతికే పనిలో పూరి జగన్నాథ్ పడ్డాడట.

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరో కోసం ఆయన వెతుకుతున్నాడని చెబుతున్నారు. వాస్తవానికి ముంబైకి మకాం మార్చిన పూరీ జగన్నాథ్ అక్కడి హీరోలతో సినిమా చేయడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఈ జనగణమన అనే డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా బయ్యర్స్ వివాదాన్ని క్లియర్ చేసే పనిలో పూరి జగన్నాథ్ దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఆయన తన రూటు మార్చాడు. ఇప్పటికే రెండు మూడు సినిమాలలో నటుడిగా కనిపించి ఇకపై నటుడిగా సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిగా ఉన్నాను అని చాటి చెబుతున్నాడు. మరి దర్శకుడిగా ఆయన సక్సెస్ కాకపోతే మాత్రం నటుడిగా స్థిరపడిపోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: