పాన్ ఇండియా హీరోగా ఎదిగిన తర్వాత ప్రభాస్ నుంచి ఆశించే సినిమాలు ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. అభిమానులు అందరూ కూడా ప్రభాస్ నుంచి భారీ చిత్రాలు రావడానికి కోరుకుంటున్నారు వారి అంచనాలకు అవి ఏ మాత్రం అటు ఇటుగా ఉన్నా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్లు అవుతున్నాయి. ఆ విధంగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రెండు సినిమాలు ఫలితాలు తేడాగా రావడంతో ఇప్పుడు ఆయన తదుపరి సినిమా తప్పకుండా విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే ఆయన బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆది పురుష్ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. సంక్రాంతి కానుకగా దీనిని విడుదల చేయాలని అధికారిక ప్రకటన ఇచ్చారు. కానీ ఈ సినిమా వేసవికి విడుదల కాబోతుంది అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రధాన కూడా త్వరలోనే రాబోతుందట. గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయడం కష్టమని భావించడంతో దీనిని వాయిదా వేశారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా వాయిదా పడడం ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అని చెప్పాలి.

ప్రభాస్ హీరోగా చాలా సినిమాలే ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను దర్శకత్వంలో మరొక సినిమాను చేస్తున్నాడు ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఆయన సినిమా చేస్తున్నాడు. ఈ విధంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ వాటిని ఒక్కొక్కటిగా విడుదల చేయాలని భావించాడు అయితే ఆది పురుష చిత్రం విడుదల వాయిదా పడడం ఆ చిత్రాల విడుదలపై కూడా ఆలస్యం అవుతుంది అని చెప్పవచ్చు. ఏదేమైనా ప్రభాస్ అభిమానులను ఇది నిరాశపరిచే విషయం అనే చెప్పాలి. చాలా రోజుల నుంచి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని ఆశలు పెంచి ఇప్పుడు గ్రాఫిక్స్ పనులు కానీ కారణంగా వాయిదా వేయడం నిజంగా చాలా మందిని నిరాశపరిచే విషయం అనే చెప్పాలి దానికి తోడు సంక్రాంతికి చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవడం ఈ చిత్రం వాయిదా పడడానికి మరొక కారణం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: