పాన్
ఇండియా హీరోగా ఎదిగిన తర్వాత
ప్రభాస్ నుంచి ఆశించే సినిమాలు ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. అభిమానులు అందరూ కూడా
ప్రభాస్ నుంచి భారీ చిత్రాలు రావడానికి కోరుకుంటున్నారు వారి అంచనాలకు అవి ఏ మాత్రం అటు ఇటుగా ఉన్నా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్లు అవుతున్నాయి. ఆ విధంగా
బాహుబలి సినిమా తర్వాత
ప్రభాస్ హీరోగా నటించిన రెండు సినిమాలు ఫలితాలు తేడాగా రావడంతో ఇప్పుడు ఆయన తదుపరి
సినిమా తప్పకుండా విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ఆయన
బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన
ఆది పురుష్ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు.
సంక్రాంతి కానుకగా దీనిని విడుదల చేయాలని అధికారిక ప్రకటన ఇచ్చారు. కానీ ఈ
సినిమా వేసవికి విడుదల కాబోతుంది అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రధాన కూడా త్వరలోనే రాబోతుందట.
గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ
సినిమా సంక్రాంతికి విడుదల చేయడం కష్టమని భావించడంతో దీనిని వాయిదా వేశారని తెలుస్తుంది. అయితే ఈ
సినిమా వాయిదా పడడం
ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అని చెప్పాలి.
ప్రభాస్ హీరోగా చాలా సినిమాలే ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రాన్ని చేస్తున్న
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను దర్శకత్వంలో మరొక సినిమాను చేస్తున్నాడు ఇక
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఆయన
సినిమా చేస్తున్నాడు. ఈ విధంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన
ప్రభాస్ వాటిని ఒక్కొక్కటిగా విడుదల చేయాలని భావించాడు అయితే
ఆది పురుష చిత్రం విడుదల వాయిదా పడడం ఆ చిత్రాల విడుదలపై కూడా ఆలస్యం అవుతుంది అని చెప్పవచ్చు. ఏదేమైనా
ప్రభాస్ అభిమానులను ఇది నిరాశపరిచే విషయం అనే చెప్పాలి. చాలా రోజుల నుంచి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని ఆశలు పెంచి ఇప్పుడు
గ్రాఫిక్స్ పనులు కానీ కారణంగా వాయిదా వేయడం నిజంగా చాలా మందిని నిరాశపరిచే విషయం అనే చెప్పాలి దానికి తోడు సంక్రాంతికి చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవడం ఈ చిత్రం వాయిదా పడడానికి మరొక కారణం అవుతుంది.