నందమూరి నటసింహం బాలక్రిష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే... `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా బ్రేకులు వేయలేని విధంగా స్పీడు చూపిస్తున్నారు.అయితే  ప్రస్తుతం ఈయన గోపీచింద్ మలినేనితో తన 107వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.   టాలీవుడ్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న టాక్‌ షో ఏ రేంజ్‌లో హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఇక  అల్లు అరవింద్ ఈ మధ్య కాలంలో 'ఆహా' ఓటీటీ సంస్థపైనే పూర్తి దృష్టిపెట్టారు. ఈ ఫ్లాట్ ఫామ్ కి కావలసిన కొత్త కంటెంట్ కోసం ఆయన అనేక రకాల కాన్సెప్టులను పరిశీలిస్తున్నారు.

ఇక ఓటీటీ సినిమాలు.. వెబ్ సిరీస్ లపైనే కాకుండా, టాక్ షోలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అయితే టాలీవుడ్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ ను వ్యాఖ్యాతగా పెట్టి ‘అన్ స్టాపబుల్’ టాక్ షోను ఎనౌన్స్ చేసినప్పుడు అంతా కూడా ఆశ్చర్యపోయారు.ఇక అందుకు కారణం అప్పటివరకూ టాలీవుడ్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ అలాంటి షోలు చేయకపోవడమే.ఇకపోతే నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న టాక్‌ షో  ‘అన్ స్టాపబుల్’ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని, ఇప్పుడు సెకండ్ సీజన్ లో దూసుకుపోతోంది.

ఇదిలావుంటే ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ మరో టాక్ షోను డిజైన్ చేయించినట్టుగా తెలుస్తోంది.ఇకపోతే ఈ టాక్ షోకి వ్యాఖ్యాతగా బ్రహ్మానందం అయితే కరెక్టుగా ఉంటుందనేది   అల్లు అరవింద్ ఆలోచన.అంతేకాదు ఆల్రెడీ బ్రహ్మానందాన్ని కలిసి కాన్సెప్టును గురించిన చర్చలు జరిపారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. అయితే తెరపైనే కాదు బయట కూడా బ్రహ్మానందం చమత్కారినే. ఇక కామెడీతో కూడిన టాక్ షోను బ్రహ్మానందం  గొప్పగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతకాలంగా ఆయన సినిమాల సంఖ్యనే తగ్గించారు. అయితే అలాంటి  బ్రహ్మానందం టాక్ షో చేయడానికి ఒప్పుకుంటారా? అనేదే డౌటు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: