దర్శకుడు పరుశు రామ్ మహేష్ తో తీసిన ‘సర్కారు వారి పాట’ విడుదల తరువాత తనకు టాప్ హీరోల నుండి వరసపెట్టి అవకాశాలు వస్తాయి అని అనుకున్నాడు. అయితే ఈమూవీ ఊహించిన స్థాయిలో బ్లాక్ బష్టర్ హిట్ కాకపోవడంతో పరుశు రామ్ కు టాప్ హీరోల నుండి పిలుపు రాలేదు.


వాస్తవానికి ‘సర్కారు వారి పాట’ విడుదల తరువాత పరుశు రామ్ నాగచైతన్యతో ఒక సినిమా చేస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. పక్కా మాస్ మసాల కథతో తయారు కాబడ్డ ఈ స్క్రిప్ట్ కు చైతూ ఒకే చెప్పాడు అన్న ప్రచారం కూడ జరిగింది. అయితే చైతన్య ఆలోచనలు మారిపోవడంతో పరుశు రామ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు అదే కథకు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఆకథను బాలకృష్ణకు వినిపించడం జరిగింది అని అంటున్నారు.


గత కొంత కాలంగా అల్లు అరవింద్ బాలకృష్ణతో తన సొంత బ్యానర్ లో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే బాలయ్య వేరే ప్రొడక్షన్ హౌస్ ల కమిట్ మింట్స్ ల మధ్య ఉండటంతో అరవింద్ ఆలోచనలు ముందుకు జరగలేదు. అయితే ఇప్పుడు అన్ ష్టాపబుల్ షో ద్వారా అల్లు కాంపౌండ్ బాలయ్యల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగి పోవడంతో తిరిగి బాలయ్య అల్లు అరవింద్మూవీ ప్రాజెక్ట్ ముందుకు రావడంతో పాటు ఆమూవీకి పరుశు రామ్ దర్శకుడుగా ఫిక్స్ అయ్యాడు అని అంటున్నారు.


ఈ ప్రాజెక్ట్ బాలకృష్ణ త్వరలో అనీల్ రావిపూడితో మొదలుపెట్టబోతున్న మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత వెంటనే పట్టాలు ఎక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరొక సినిమాకు లైన్ క్లియర్ చేస్తున్న బాలకృష్ణ సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ యంగ్ హీరోలను డామినేట్ చేస్తున్నాడు. అంతేకాదు ఈవయసులో బాలకృష్ణ యాడ్స్ కూడ చేస్తూ అందరికీ షాక్ ఇస్తూ తాను తలుచుకుంటే ఏదైనా చేయగలను అని నిరూపిస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: