టాలీవుడ్ లో హీరోగా అల్లు శిరీష్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. దాదాపుగా మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో రావడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ఈ ముద్దుగుమ్మ కూడా సరైన అవకాశాలు సక్సెస్లో లేక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగించలేక పోతోంది. దీంతో అటు అల్లు శిరీష్ కెరియర్ ,అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ ఈ సినిమా మీద ఆధారపడింది మరి ఈ సినిమా వీరిద్దరి కెరీర్ ని మార్చిందేమో చూద్దాం.

ఊర్వశివో రాక్షసివో సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగస్తుడిగా కనిపిస్తారు. ఇక ఆ ఆఫీసులోనే సింధు అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఆ ప్రేమతో వీరిద్దరూ ఒకరోజు చాలా దగ్గరయ్యేలా చేస్తుంది. ఆ సమయంలో  శ్రీ..సింధును ప్రేమిస్తున్నట్లుగా తెలియజేస్తారు. కానీ అందుకు సింధు ఒప్పుకోదు. కేవలం మన ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని తెలియజేస్తుంది. ఇక తర్వాత శ్రీ..సింధు కోసం తన మనసును ఎలా మారుస్తారో ఇంతకీ సింధు ఎందుకు అలా వాడుకొని వదిలేస్తుందో తెలియాలి అంటే.. సినిమా నీ థియేటర్లో చూడాల్సిందే.


ఈ సినిమాలో స్టార్ నటీనటుల, రొమాన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ప్లస్ గా మారాయి. కేవలం అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీయడం మాత్రమే కాస్త మైనస్ పాయింట్ ఆన్నట్లుగా సమాచారం. చివరిగా ఈ రొమాంటిక్ డ్రామా సినిమాతో ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ దెబ్బతోనైనా అల్లు శిరీష్,అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ మారి పలు సినిమా అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: