రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా కంటే ముందు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ "బాహుబలి" సిరీస్ మూవీ ల ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా సాహో , రాధే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో ,  అంతకు మించిన మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ "ఆది పురుష్" అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు.  సలార్ అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

అలాగే ప్రాజెక్ట్ కే అనే పాన్ వరల్డ్ మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లతో పాటు మారుతీ దర్శకత్వంలో మరో మూవీ లో కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ లో నటించడానికి ఇప్పటికే కమిట్ అయి ఉన్నాడు. ఇలా వరస మూవీ లతో ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉన్న ప్రభాస్ మరో క్రేజీ టాలీవుడ్ దర్శకుడి దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు , ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి డి వి వి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: