టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తిరిగి వకీల్ సాబ్ మూవీ తో మూవీ లలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఎం ఎం కీరవాణి మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... హరిహర వీరమల్లు మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తెలుగు ,  కన్నడ ,  తమిళ , హిందీ ,  మలయాళ భాషల్లో విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: