ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని సొంత టాలెంట్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ ఇటీవలే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ చూశాడు అన్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై చివరికి డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ను మలుపు తిప్పుతుంది అనుకుంటే చివరికి నిరాశ మిగిల్చింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా ద్వారా అటు నిర్మాతలు కూడా నష్టాల్లో కూరుకు పోయారు అని చెప్పాలి.


 అయితే ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ అటు విజయ్ దేవరకొండపై పడుతుందని అందరూ భావించారు. ఇక కెరియర్ ముగిసిపోతుందని ఎంతోమంది అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా విజయ్ దేవరకొండ కెరియర్ ముందుకు సాగుతూ ఉండడంగమనార్హం. ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఖుషి అనే సినిమా తెరకెక్కుతుంది. ఇకపోతే ఇక ఇప్పుడు విజయ్ మరో అదిరిపోయే ఆఫర్ అందుకున్నాడు అన్నది తెలుస్తుంది. గీత గోవిందంతో హిట్టు ఇచ్చిన దర్శకుడు పరశురాంతో ఇప్పటికే ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే బాలీవుడ్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్  ఆదిత్య చోప్రా బ్యానర్లో ఆల్ టైం హిట్ దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకు నేటి తరానికి తగ్గట్టుగా రీమిక్స్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారట.


 అయితే ఈ సినిమాలో షారుక్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ నటిస్తాడని ప్రచారం కూడా జరిగింది. ఇక అటు షారుక్ అభిమానులు సైతం ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.  కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు అన్నది తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను విజయ దేవరకొండ తో దొరకేకించాలని నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నాడట. ఈ సినిమా ఒకప్పుడు షారుక్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడు ఆదిత్య చోప్రా కి హీరోగా షారుక్ ఖాన్ కు ఊహించని స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాకు నిర్మాతగా ఆదిత్య చోప్రా వ్యవహరిస్తాడా లేకపోతే ఇంకా ఎవరైనాఉంటారా అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: