తమిళ ఫేమస్  స్టార్  డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా  తమిళ స్టార్ నటీనటులతో "పొన్నియిన్ సెల్వన్" మొదటి భాగం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.బాహుబలికి పోటీగా విడుదల అయిన ఈ సినిమా ఆ రేంజిలో విజయం సాధించకపోయినా తమిళనాడులో మాత్రం చాలా పెద్ద విజయం సాధించింది. అక్కడ రికార్డుల వర్షం కురిపిస్తుంది.చోళులు ఇంకా పాండ్యుల మధ్య జరిగిన అతిపెద్ద యుద్ధం బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, జయం రవి, విక్రమ్, కార్తీ, త్రిష వంటి స్టార్లు ముఖ్యపాత్రలు పోషించారు.ఫస్ట్  పార్ట్  భారీ హిట్  అవ్వడంతో ఈ సినిమాకి రెండవ భాగమైన "పొన్నియిన్ సెల్వన్: 2" మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని తమిళ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇక తమిళంలో "పొన్నియిన్ సెల్వన్ 1" బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 400 కోట్ల పైగా కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల దాకా వసూళ్లు చేసింది. ఇంకా అలాగే తాజాగా ఈ సినిమా ఇప్పుడు తమిళనాడులో ఒక రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.2022లో  చాలా ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన తమిళ సినిమాగా ఈ చిత్రం రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకు ఇంత ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన నాలుగవ సినిమాగా కూడా పేరు తెచ్చుకుంది. ఇక దేశవ్యాప్తంగా అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో 15వ స్థానాన్ని సంపాదించింది. మరి "పొన్నియిన్ సెల్వన్ 2" సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోందో చూడాలి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 14 లేదా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

PS2