అల్లు శిరీష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఊర్వశివో.. రాక్షసివో'. రాకేష్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలిలేని, విజయ్‌ ఎం నిర్మించారని తెలుస్తుంది .

ఇందులో శిరీష్ సరసన అను ఇమ్మాన్యూయేల్ కథానాయికగా నటించింది. నవంబర్ 4న విడుదలైన ఈ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. అయితే ఈ చిత్రీకరణ సమయం నుంచి అను, శిరీష్ ప్రేమలో ఉన్నారంటూ చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ రూమర్స్ పై స్పందించింది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ఊర్వసివో రాక్షసివో నిసిమాలో నటించడానికి ముందు అల్లు శిరీష్‌ను రెండు సార్లు మాత్రమే కలిసానని తెలిపిందట . అయితే అలా కాఫీ షాపులో కలుసుకున్న ఫోటోలు బయటకు రావడంతో మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ క్రియేట్ చేశారని కూడా వెల్లడించింది.

ఇక ఈ క్రమంలోనే.. అను ఇమ్మన్యూవేల్ ను.. అల్లు అరవింద్‌.. ఈ విషయం గురించి అడిగారట. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా ఏంటి? అంటూ ఆరా తీశారట. కాని అలాంటిదేమీ లేదని అను కాస్త క్లారిటీగా చెప్పడంతో.. అరవింద్ ఆ టాపీక్‌ కట్ చేశారు. దానిపై ఇద్దరు కాసేపు నవ్వుకున్నట్లు చెప్పింది. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్య్వూలో తనే స్వయంగా చెప్పారు అను ఇమ్మాన్యూయేల్. చెప్పడమే కాదు.. ఇప్పడా మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అయితే ఇలాంటి రూమర్స్‌ను తను సీరియస్‌గా తీసుకోనని చెప్పిందట..

” ఈ సినిమా కు శిరీష్‌ హీరో అని నాకు ముందే తెలుసు. ఈ కు ముందు ఎప్పుడే శిరీష్‌ని కలవలేదు. పూజ రోజున మొదటిసారి కలిశా. డైరెక్టర్‌ కథ మొత్తం నెరేట్‌ చేశాక నేను, శిరీష్‌ కాఫీ షాప్‌లో కూర్చుని పాత్రల గురించి మాట్లాడుకున్నాం. ఒకరి తత్వం గురించి ఒకరు తెలుసుకున్నాం. శ్రీ, సింధూ పాత్రల్లో రియలిస్టిక్‌గా కనిపించడానికి కష్టపడ్డాం. స్ర్కీన్‌పై మా ఇద్దరి మధ్య లవ్‌ సీన్స్‌, కెమిస్ట్రీ, ఎమోషన్స్‌ బాగా ఆకట్టుకుంటాయి. శిరీష్‌ గుడ్‌ కోస్టార్‌. మేకింగ్‌ మీద చాలా పట్టుంది. మ్యూజిక్‌, ఆర్ట్‌, టెక్నికల్‌ ఇలా అన్ని విషయాల మీద అతనికి అవగాహన ఉంది. నాతో మ్యూజిక్‌ గురించి ఎక్కువగా మాట్లాడేవాడు” అంటూ చెప్పుకొచ్చిందట

మరింత సమాచారం తెలుసుకోండి: